ఈఎస్ఐ స్కామ్‌పై స్పందించిన అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-02-21T19:05:21+05:30 IST

ఈఎస్‌ఐలో నామినేషన్‌పై వర్క్‌ ఆర్డర్ల వ్యవహారంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.

ఈఎస్ఐ స్కామ్‌పై స్పందించిన అచ్చెన్నాయుడు

అమరావతి: ఏపీ ఈఎస్‌ఐలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రధాని ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. నామినేషన్‌పై వర్క్‌ ఆర్డర్ల ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ‌తెలంగాణలో ఎలా అమలు చేశారో.. అలాగే అమలు చేశామని తెలిపారు. తాను రాసిన అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లోనూ అదే విషయం ఉందన్నారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అచ్చెన్నాయుడు తెలిపారు. అవినీతికి తాను ఎప్పుడూ దూరమేనని.. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవచ్చన్నారు.  తాను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేడయం సరైంది కాదన్నారు. ఆనాటి రికార్డులన్ని తన దగ్గర ఉన్నాయన్నారు.   


ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కీలక డాక్యుమెంట్లను విడుదల చేసిన అచ్చెన్నాయుడు..

Updated Date - 2020-02-21T19:05:21+05:30 IST