మాన్సాస్ ఆస్తులపై దౌర్జన్యం మంచి పద్ధతి కాదు: Ashok gajapathiraju
ABN , First Publish Date - 2022-01-07T17:49:13+05:30 IST
మాన్సాస్ ఆస్తులపై దౌర్జన్యం చేయటం మంచి పద్దతికాదని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అన్నారు.
విజయనగరం: మాన్సాస్ ఆస్తులపై దౌర్జన్యం చేయటం మంచి పద్దతికాదని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అన్నారు. మాన్సాస్లో ఆర్ధిక అక్రమాలు జరిగాయని ఎక్కడెక్కడ నుండో ఆడిటర్లను తెప్పించి హంగామా సృష్టించారని, చివరకు కోర్టుతో చీవాట్లుతిన్నారని తెలిపారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా చెడ్డవారి చేతిలో పడితే చెడే జరుగుతుందన్నారు. ఎంత చెడ్డ రాజ్యాంగమైనా మంచి వారి చేతిలో పడితే మంచే జరుగుతుంది అన్న అంబేద్కర్ వ్యాఖ్యలు నేడు నిజమవుతున్నాయని తెలిపారు. దేవుడు ఆస్తులు, ధర్మాదాయ ఆస్తులపై పడటం గమ్మత్తుగా మారిందన్నారు. ఏ మత విషయాలతో ప్రభుత్వాలకు సంబంధం లేదని... కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నమని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు చేశారు.