ఎన్టీఆర్ విగ్రహంపై చెయ్యేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-01-03T02:55:01+05:30 IST

మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహంపై ..

ఎన్టీఆర్ విగ్రహంపై చెయ్యేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: అచ్చెన్నాయుడు

గుంటూరు: మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహంపై చెయ్యేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అది 6 అడుగుల విగ్రహం కాదని.. అఖండ తెలుగుజాతి ఆత్మగౌరవమని చెప్పారు. ‘‘ఇది మద్యం మత్తులో జరిగిన ఘటన కాదు. అధికార మత్తులో జరిగిన ఘటన. వైసీపీ నేతలు, కార్యకర్తలు అధికార మదంతో విర్రవీగి ప్రవర్తిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై, ప్రజలపై దాడులు చేశారు. ఇప్పుడు మహానుభావుల విగ్రహాలపై దాడులు చేస్తున్నారు. పల్నాడులో వైసీపీ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. అధికారం ఉంది కదా అని హద్దు మీరితే చూస్తూ ఊరుకోం. ముందు రోజుల్లో ‎వడ్డీ, చక్రవడ్డీ రెండూ కలిపి చెల్లిస్తాం.  ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిపై, అందుకు ప్రేరేపించిన వారిపై పోలీసులు  తక్షణమే చర్యలు తీసుకోవాలి.’’ అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-03T02:55:01+05:30 IST