ఒక్క అవకాశం ఇచ్చి...దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకున్నాం: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-12-27T19:20:52+05:30 IST

ఒక్క అవకాశం ఇచ్చి... దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకున్నామని.. వ్యవస్థలు నాశనం అయిపోయాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

ఒక్క అవకాశం ఇచ్చి...దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకున్నాం: అచ్చెన్న

విశాఖపట్నం: ఒక్క అవకాశం ఇచ్చి... దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకున్నామని.. వ్యవస్థలు నాశనం అయిపోయాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో విద్యుత్ రంగం చిన్నాభిన్నం అయిందని తెలిపారు. టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించామని.. నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని చెప్పారు. రాయలసీమ థర్మల్ ప్లాంట్ మూసివేసే మూర్ఖుడు జగన్ అని..ఈ ప్లాంట్ మూత పడకుండా టిడిపి కృషి చేసిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ప్రజలకు 24 గంటలు, రైతులకు 7 గంటలు విద్యుత్ అందించామని తెలిపారు. తమ చేతకాని తనంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు  హయాంలో ఎంతో మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేశామన్నారు. దుర్మార్గుడు పాదయాత్రలో ఇచ్చిన హామీల నమ్మి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు.


సీపీఎస్ రద్దు చంద్రబాబుకే సాధ్యం కాకపోతే... ఈ పిల్ల కాకితో ఏమి అవుతుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉద్యోగులు, కార్మికులు సంక్షేమం కోసం కృషి చేశామన్నారు. మళ్లీ కార్మిక సంఘాలకు పూర్వ వైభవం వచ్చేలా చేస్తామని తెలిపారు. ఏపీని అందరూ అస్యహించుకునే స్థితికి తెచ్చారన్నారు. ఆరు నూరు అయిన... మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని... బాబు ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమని అన్నారు. ఏపీ ఆస్తులను తెలంగాణకు దోచిపెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

Updated Date - 2021-12-27T19:20:52+05:30 IST