ప్రతి గ్రామంలో సభ్యత్వం చేపట్టాలి: అచ్చెన్న

ABN , First Publish Date - 2022-04-21T17:11:00+05:30 IST

ప్రతి గ్రామంలో సభ్యత్వం చేపట్టాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రతి గ్రామంలో సభ్యత్వం చేపట్టాలి: అచ్చెన్న

అమరావతి: ప్రతి గ్రామంలో సభ్యత్వం చేపట్టాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అచ్చెన్న మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు ఓట్లేయించే వాళ్లని సభ్యులుగా చేర్చడంలో చొరవ చూపాలని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు వస్తాయన్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగిచే పదవులు రావని.. దక్కవని తెలిపారు. గతంలో మాదిరిగా సభ్యత్వం విషయంలో ఏదేదో చెప్పాలనుకుంటే కుదరదన్నారు. సభ్యత్వం వివరాలు మొత్తం ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో వివరాలు అప్డేట్ అవుతాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-21T17:11:00+05:30 IST