పోరస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాద ఘటన కలచివేసింది: Achennaidu

ABN , First Publish Date - 2022-04-14T14:28:43+05:30 IST

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటన కలచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

పోరస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాద ఘటన కలచివేసింది: Achennaidu

అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటన కలచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుతున్నానని తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎల్జీపాలిమర్స్‌కు ఇచ్చిన పరిహారాన్ని పోరస్ కెమికల్ బాధితులకు ఇవ్వాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-14T14:28:43+05:30 IST