చేయూత పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-06-24T04:59:47+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చి హామీ ప్రకారం 45 ఏళ్లు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు రూ. 3 వేల చొప్పన ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు.
నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి
భీమవరం అర్బన్, జూన్ 23 : వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చి హామీ ప్రకారం 45 ఏళ్లు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు రూ. 3 వేల చొప్పన ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. ఆమె కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.45 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 18,750 వైఎస్సార్ చేయూత అందించి మాట మార్చి మడమ తిప్పారని ఆరోపిం చారు. ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు పెన్షన్ అనుకున్నా ఏడాదికి రూ.36 వేలు ఐదేళ్లకు రూ.1.80 లక్షల ఇవ్వాలి కాని ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మహిళలకు రూ.1.05 లక్షల చొప్పన ఎగనామం పెడుతున్నారన్నారు.