వాళ్ల వల్లే మేమిలా... జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం

ABN , First Publish Date - 2021-03-07T18:40:43+05:30 IST

‘రావాలి ప్రభాకర్.. కావాలి ప్రభాకర్’ అని తాడిపత్రి ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

వాళ్ల వల్లే మేమిలా... జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం

తాడిపత్రి: ‘రావాలి ప్రభాకర్.. కావాలి ప్రభాకర్’ అని తాడిపత్రి ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వారి ఆదరణ చూస్తుంటే తమకే భయమేస్తోందన్నారు. ప్రజల అభిమానం అలా ఉందన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన ఆయన.. రెండున్నరేళ్లలో వాళ్లు అనుభవించిన బాధలను పంచుకుంటున్నారన్నారు. మున్సిపాలిటీలో మంచి వాతావరణాన్ని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. ఆనాడు ‘రావాలి జగన్ .. కావాలి జగన్’ అన్నారని.. ఈసారి ఆ గాలి తమ వైపు వచ్చిందన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. మున్సిపాలిటీలో కచ్చితంగా తాము వస్తామన్నారు. ప్రజలు నమ్మకంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు తన నియోజకవర్గంలోనే వచ్చాయన్నారు. ప్రజలను తన ఆత్మీయ బంధువులుగా అనుకుంటున్నామని, 1952 నుంచి ఏకధాటిగా ఉన్నామంటే వాళ్ల అభిమానమే కారణమన్నారు. ఈ ఊరే తమకు పేరు తీసుకొచ్చిందని ఉద్వేగానికి గురయ్యారు. వాళ్లే తమ దేవుళ్లని.. వాళ్లకు సేవ చేయడానికే పుట్టామన్నారు. 

Updated Date - 2021-03-07T18:40:43+05:30 IST