టీడీపీదే అధికారం
ABN , First Publish Date - 2021-09-29T05:07:44+05:30 IST
అధైౖర్యపడాల్సిన పనిలేదని.. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ మంత్రాలయం ఇన్చార్జి తిక్కారెడ్డి అన్నారు.
- మంత్రాలయం ఇన్చార్జి తిక్కారెడ్డి
ఎమ్మిగనూరు, సెప్టెంబరు 28: అధైౖర్యపడాల్సిన పనిలేదని.. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ మంత్రాలయం ఇన్చార్జి తిక్కారెడ్డి అన్నారు. కోసిగి మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలు ఐదుగురు ఎమ్మిగనూరులో తిక్కారెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాసరెడ్డి, కుమారుడు దివాకర్రెడ్డిలను మంగళవారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతోందని విమర్శించారు. ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయటమేగాక, అక్రమకేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, ఎంపీటీసీలు శివాని, భవనాసి రాజు, పైఇంటి పల్లవి, గట్టులక్ష్మి, తలారి హనుమంతు, నాయకులు నర్సిరెడ్డి, ఙ్ఞనేష్, వీరారెడ్డి, తాయన్న, రంగన్న, కప్పయ్య, గోపాల్, భీమయ్య, కొరివి హనుమంతు, సల్మాన్రాజు, మారెష్, మహాదేవ, వెంకటేష్, నర్సిరెడ్డి పాల్గోన్నారు.