‘సీనియర్ల సేవలు అవసరం’
ABN , First Publish Date - 2022-01-26T05:08:43+05:30 IST
పార్టీ బలోపేతానికి సీనియర్ల సేవలు ఎంతో అవసరమని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.
ప్యాపిలి, జనవరి 25: పార్టీ బలోపేతానికి సీనియర్ల సేవలు ఎంతో అవసరమని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఏనుగమర్రి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు రామక్రిష్ణను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవలందించిన నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఎప్పటికప్పుడు వారి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్లుతామన్నారు. డోన్ నియోజక వర్గంలో టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. అందు కోసం తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డోన్ మార్కెట్యార్డు మాజీ చెర్మన్ మురళీక్రిష్ణ గౌడు, నంద్యాల పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్భట్టు, ప్యాపిలి, డోన్ మండలాల టీడీపీ అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.