రమేష్ కుమార్‌కు టీడీపీ కొమ్ముకాస్తోంది: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2020-05-31T19:16:49+05:30 IST

సాంకేతిక అంశాలను సాకుగా చూపి ప్రభుత్వ పథకాలను కోర్టు ద్వారా..

రమేష్ కుమార్‌కు టీడీపీ కొమ్ముకాస్తోంది: మంత్రి బొత్స

విజయవాడ: సాంకేతిక అంశాలను సాకుగా చూపి ప్రభుత్వ పథకాలను కోర్టు ద్వారా టీడీపీ అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రమేష్ కుమార్‌కు టీడీపీ  కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఎస్ఈసీ వ్యవహారంలో ఏజీ వక్రబాష్యం చెబుతున్నారంటూ జరుగుతున్న వాదనలో వాస్తవం లేదని మంత్రి బొత్స అన్నారు. కోర్టు తీర్పుపై విపక్షాలే వక్రబాష్యం చెబుతున్నాయని విమర్శించారు.


ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కోల్పోయారని, కొత్తగా కనగరాజ్ వచ్చారని బొత్స తెలిపారు. అయితే పదవి కోల్పోయిన తర్వాత రమేష్ కుమార్ తనకు అన్యాయం జరిగిందంటూ.. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో తప్పులేదన్నారు.

Updated Date - 2020-05-31T19:16:49+05:30 IST