టీడీపీ ఏనాడూ హద్దు దాటలేదు

ABN , First Publish Date - 2021-10-23T05:01:30+05:30 IST

టీడీపీ కేడర్‌ ఏనాడూ హద్దులు దాటలేదని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సంఘీభావ దీక్ష చేపట్టారు.

టీడీపీ ఏనాడూ హద్దు దాటలేదు
సంఘీభావ దీక్షలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

 మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: టీడీపీ కేడర్‌ ఏనాడూ హద్దులు దాటలేదని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి  సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓదార్పు యాత్రలను జ్ఞాపకం తెచ్చుకోవాలన్నారు. జగన్‌ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అప్పటి  టీడీపీ ప్రభుత్వం సహకరించిందన్నారు. అప్పట్లో తాము దురుసు గా ప్రవర్తించి ఉండి ఉంటే అధికారంలోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు.  దాడులను ఇలాగే కొనసాగిస్తే అధికార పార్టీకే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, నగర అధ్యక్షుడు ఎం.వెంకటేష్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-23T05:01:30+05:30 IST