టీడీపీ గూటికి మాజీ కౌన్సిలర్‌

ABN , First Publish Date - 2021-10-29T05:41:28+05:30 IST

గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉన్నది.

టీడీపీ గూటికి మాజీ కౌన్సిలర్‌
శ్రీనివాసులును పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి


గిద్దలూరు, అక్టోబరు 28 : గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా గిద్దలూరు మున్సిపాలిటీలోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్‌ మండ్ల శ్రీనివాసులు 40 మంది అనుచరులతో గురువరం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపాలిటీలో కొండపేటలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ మండ్ల శ్రీనివాసులుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాసులు వెంట 40 మంది అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో, మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. ఒక్కసారి వైసిపికి అధి కారం ఇస్తే అభివృద్ధిని మరిచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేసి వారి మన్ననలు పొందాలని సూ చించారు. కార్యక్రమంలో పట్టణశాఖ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, మండలశాఖ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, టిడిపి నాయకులు గోపాల్‌రెడ్డి, మహబూబ్‌బాషా, కిశోర్‌, మస్తాన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ వెంకటస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:41:28+05:30 IST