ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన TDP..
ABN , First Publish Date - 2022-05-17T14:34:17+05:30 IST
ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన TDP..
కడప జిల్లా/కమలాపురం : పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానానికి 2023 మార్చిలో జరగనున్న ఎన్నికలకు టీడీపీ (Telugudesam) అభ్యర్థిగా పులివెందుల ప్రాంతానికి చెందిన రామ్గోపాల్రెడ్డిని ఎంపిక చేశామని కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామ్గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మార్చిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధిస్థానం తనను ఎంపిక చేసిందన్నారు. తనను ఎంపిక చేసిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.