9న పరిటాలలో టీడీపీ రైతు పోరు బహిరంగ సభ
ABN , First Publish Date - 2022-07-06T03:55:13+05:30 IST
9న పరిటాలలో రైతు పోరు బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర విజయస్తూపం దగ్గర ..
ఎన్టీఆర్: 9న పరిటాలలో రైతు పోరు బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర విజయస్తూపం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జగన్ అస్తవ్యస్థ నిర్ణయాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. సీఎం సొంత జిల్లాలోనూ ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు వస్తుందన్నారు. రైతులు క్రాప్ హాలీడ్ పాటిస్తున్నారని..49 లక్షల మంది రైతులు ఈ-క్రాపింగ్ నమోదు చేసుకుంటే 20 లక్షల మందినే పరిగణనలోకి తీసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఓ ప్రకటనలో తెలిపారు.