కార్యకర్తలకు టీడీపీ అండ : ఉమా
ABN , First Publish Date - 2022-01-28T05:23:35+05:30 IST
టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా వుంటుందని నియోజకవర్గ ఇనచార్జ్ ఉమామహేశ్వరనాయుడు పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం, జనవరి 27: టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా వుంటుందని నియోజకవర్గ ఇనచార్జ్ ఉమామహేశ్వరనాయుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో కుందుర్పి మండలం కెంచంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రాంప్రసాద్ వైద్య చికిత్స కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. బా ధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకు లు దొడగట్ట నారాయణ, మురళి, తలారి సత్యప్ప, రామరాజు, నరసింహప్ప, రవి, నాగరాజు, రామాంజనేయులు, గురుమూర్తి, ఓబుళపతి, ఈడిగ వెంకటేశులు, నగే ష్యాదవ్, మంజు, ఆదిశేషు, రామ్మూర్తి యాదవ్ పాల్గొన్నారు.