టీడీపీ ఆధ్వర్యంలో కోడిగుడ్ల పంపిణీ..

ABN , First Publish Date - 2020-04-08T13:16:59+05:30 IST

ఎనికేపాడులో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజలకు కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని

టీడీపీ ఆధ్వర్యంలో కోడిగుడ్ల పంపిణీ..

విజయవాడ: ఎనికేపాడులో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజలకు కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎలాంటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ముందుంటారని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల లక్షల మంది పేదలు పస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన సాయం ఏమాత్రం సరిపోదన్నారు. పేదలకు నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని నాని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే లాక్‌డౌన్‌ను పెంచుతారనే భావిస్తున్నామని అన్నారు.

Updated Date - 2020-04-08T13:16:59+05:30 IST