టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యవర్గం
ABN , First Publish Date - 2022-07-03T05:17:20+05:30 IST
తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా వాణిజ్య విభాగం నూతన కార్యవర్గాన్ని నియమించారు. శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ఇన్చార్జి దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు.
మహారాణిపేట, జూలై 2: తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా వాణిజ్య విభాగం నూతన కార్యవర్గాన్ని నియమించారు. శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ఇన్చార్జి దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. వాణిజ్య విబాగం జిల్లా అధ్యక్షుడిగా మొల్లేటి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా కాళీప్రసాద్లను నియమించారు. ఈ సమావేశంలో పార్టీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.