ఆగని అసంతృప్తి జ్వాలలు
ABN , First Publish Date - 2022-04-12T01:57:47+05:30 IST
మంత్రి పదవులు పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తమ తమ నాయకులకు మంత్రి పదవులు దక్కలేదని అనుచరగణం
విజయవాడ: మంత్రి పదవులు పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తమ తమ నాయకులకు మంత్రి పదవులు దక్కలేదని అనుచరగణం సోమవారమూ ఆందోళనలకు దిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభానుకి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఉదయభాను అనుచరుల పట్టణంలోని ప్రధాన రహదారులపై పెట్రోలు పోసి నిప్పుపెట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. విజయవాడ బందరు రోడ్డు డీవీ మేనర్ వద్ద కూడా ఉదయభాను అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. జగ్గయ్యపేటకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తమ నాయకుడికి న్యాయం చేయకపోతే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.