బూడిద చెరువులో అక్రమాలు అరికట్టాలి
ABN , First Publish Date - 2022-01-22T06:22:14+05:30 IST
బూడిద చెరువులో అక్రమాలు అరికట్టాలి
ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ వద్ద టీడీపీ ఆందోళన
ఇబ్రహీంపట్నం, జనవరి 21 : ఎన్టీటీపీఎస్ బూడిద చెరువులో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, మున్సిపల్ టీడీపీ నాయకులు చుట్టుకుదురు శ్రీనివాసరావు, చెన్నుబోయిన చిట్టిబాబులు డిమాండ్ చేశారు. బూడిద చెరువులో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ టీడీపీ నాయకులు ట్రాన్స్పోర్టు నిర్వాహకులతో కలిసి శుక్రవారం ఎన్టీటీపీఎస్ మెయిన్గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యలమంచిలి కృష్ణమోహన్ పేరుతో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ బామ్మర్ది వేసిన బూడిద టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ట్రాన్స్పోర్టు నిర్వాహకులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. నాయకులు చనమోలు నారాయణరావు, గరికపాటి శివ, సుంకర విష్ణుకుమార్, కొత్తపల్లి ప్రకాశ్, కోయ వెంకట్రావు, మైలా సైదులు, మాబు సుబానీ, బెనర్జీ ట్రాన్స్పోర్టు నిర్వాహకులు ఏసుబాబు, మల్లి, తురక వెంకటేశ్వరరావు, తిరుమలరావు, రామినేని భవానీ ప్రసాద్, రామినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు.