పోలీసులకు టీడీపీ అభినందనలు
ABN , First Publish Date - 2020-04-03T11:19:51+05:30 IST
లాక్డౌన్ సమయంలో విశేష సేవలం దిస్తున్న పోలీసులకు టీడీపీ రామభద్రపురం మండల కమిటీ అభినందనలు తెలిపింది.
రామభద్రపురం, ఏప్రిల్ 2: లాక్డౌన్ సమయంలో విశేష సేవలం దిస్తున్న పోలీసులకు టీడీపీ రామభద్రపురం మండల కమిటీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు గురువారం వారికి తాగునీటి బాటిళ్లు, మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ మాస్కుల కొరత తీవ్రంగా ఉందని, పల్లెల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావ ణాన్ని పిచికారీ చేయడం లేదని తెలిపారు.
అంతటా పారిశుధ్యం లోపించిం దని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మందులు ఉండేటట్లు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసంతుల తిరుపతిరావు, వి.వెంకటరావు, డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చొక్కాపు రామారావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు మడక తిరుపతి రావు, మాజీ సర్పంచ్ కరణం భాస్కరరావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు కనిమెరక శంకరరావు, ఎస్ఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు.