TDP chief: ఇది దొంగ ప్రభుత్వం.. దుర్మార్గపు ప్రభుత్వం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-22T17:47:05+05:30 IST

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

TDP chief: ఇది దొంగ ప్రభుత్వం.. దుర్మార్గపు ప్రభుత్వం: చంద్రబాబు

పాలకొల్లు(ఏలూరు జిల్లా): జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పాలకొల్లులో పర్యటించిన టీడీపీ అధినేత... జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది దొంగ ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వమని మండిపడ్డారు. డబ్బులు కట్టించుకుని ఇళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వమన్నారు. పోలవరాన్ని ముంచేశారని... పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే ఇంత ముంపు వుండేది కాదని తెలిపారు. పోలవరం పూర్తయ్యి నదులు అనుసంధానం అయి ఉంటే ప్రతి ఎకరాకు నీరు వచ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ(Telangana)లో వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు ఇస్తే, ఇక్కడ రూ.2వేలు ఇస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక(Srilanka)లో పాలకులు ఏ విధంగా పారిపోవాల్సి వచ్చిందో.. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే ఇక్కడ నాయకులు పారిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత కూడా వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-22T17:47:05+05:30 IST