AP: కాసేపట్లో దీక్షకు కూర్చోనున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-21T13:33:22+05:30 IST

టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు.

AP: కాసేపట్లో దీక్షకు కూర్చోనున్న చంద్రబాబు

అమరావతి: టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు. పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. దీక్షకు మద్దతుగా  వివిధ జిల్లాల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి  పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే టీడీపీకి గుంటూరు అర్బన్ పోలీసుల నోటీసులు అందజేశారు. నేతలు, కార్యకర్తలను పార్టీ కార్యాలయం వరకు పోలీసులు అనిమతిస్తారా అనేది అనుమానంగా ఉంది.

Updated Date - 2021-10-21T13:33:22+05:30 IST