రాజకీయాలను క్రిమినలైజ్ చేశారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-05T02:04:22+05:30 IST

రాష్ట్రంలో రాజకీయాలను క్రిమినలైజ్ చేశారని టీడీపీ

రాజకీయాలను క్రిమినలైజ్ చేశారు: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో రాజకీయాలను క్రిమినలైజ్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల వ్యవస్థ ప్రహసనంలా మారిపోయిందన్నారు. గతంలో ఎన్నడూ చూడని పోకడను ఎన్నికల్లో చూస్తున్నామన్నారు. టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉండకుండా చేసేందుకు అన్నిరకాల కుట్రలూ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో గెలిచిన తర్వాత క్యాంపులు పెట్టి కాపాడితే..ఇప్పుడు నామినేషన్లకు కూడా క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-12-05T02:04:22+05:30 IST