TDP Chief: వరద బాధితులను ఆదుకోవాలని దాతలకు చంద్రబాబు విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-07-30T20:50:13+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

TDP Chief: వరద బాధితులను ఆదుకోవాలని దాతలకు చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... దశాబద్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. నిత్యావసరాలు లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని అన్నారు. వరద బాధితుల(Flood victims)ను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. బాధితులను సమాజం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ద్వారా కొంతమేరకు సాయం కొనసాగుతోందన్నారు. దాతలు వారి పేరుతోగానీ.. టీడీపీ ద్వారా గానీ సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-30T20:50:13+05:30 IST