ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.. నంద్యాల ఘటనపై చంద్రబాబు

ABN , First Publish Date - 2020-11-08T21:40:38+05:30 IST

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు.

ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.. నంద్యాల ఘటనపై చంద్రబాబు

ఇంటర్నెట్ డెస్క్: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనమన్నారు. నాడు శాసనమండలిలో సభ్యులందరి ముందు చైర్మన్ షరీఫ్‌ని మతం పేరుతో దూషించారన్నారు. 


ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. ‘‘రాజమండ్రిలో పదేళ్ళ ముస్లిం బాలికపై అత్యాచారయత్నం చేసిన వారిపై కేసు పెడితే.. కేసు వెనక్కు తీసుకోవాలని వైసీపీ నేతలు బాలిక తండ్రి సత్తార్‌పై ఒత్తిడి తేవడంతో ఆయన ఆత్మహత్య వరకు వెళ్ళారు. ఈరోజు చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని అధికారులు వేధించడంతో ఒక నిండు కుటుంబం బలైపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటున్న ప్రభుత్వం... దీనికి ఏమని సమాధానం చెప్తుంది? నంద్యాల ఘటను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి వీడాలి’’ అని ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-11-08T21:40:38+05:30 IST