నేడు శ్రీకాకుళం జిల్లాలో Chandrababu పర్యటన

ABN , First Publish Date - 2022-05-04T12:34:22+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించనున్న

నేడు శ్రీకాకుళం జిల్లాలో Chandrababu పర్యటన

శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ మంగళవారం  సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు దళ్లవలస గ్రామం చేరుకుంటారు. 9.30 గంటలకు విశాఖ టీడీపీ కార్యాలయానికి చేరుకుని, రాత్రి అక్కడే బసచేస్తారు.

Read more