టీపీపీ నేత పులికి రక్షణ కల్పించండి... డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-01-08T19:38:06+05:30 IST

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

టీపీపీ నేత పులికి రక్షణ కల్పించండి... డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేత పులి మరియ దాస్‌ అలియాస్ చిన్నాకు వైసీపీ గుండాల నుంచి రక్షణ కల్పించాలని లేఖ పేర్కొన్నారు. తుళ్లూరు ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియ దాస్‌ వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరణ ఇచ్చారు. ఎంపీ నందిగం సురేష్‌ ఆదేశాలతో మరియ దాస్‌పై దాదాపు 30 కేసులు పెట్టారన్నారు. మరియ దాస్‌కు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం, ఎంపీ నందిగాం సురేష్ బాధ్యత వహించాలని చంద్రబాబు లేఖలో తెలియజేశారు. 

Updated Date - 2022-01-08T19:38:06+05:30 IST