పొత్తులపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-06T19:03:54+05:30 IST

పొత్తులపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పొత్తులపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కాకినాడ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు.. శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు Chandrababu పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఈ సందర్భంగా బాబు తేల్చిచెప్పేశారు.


YS Jagan సర్కార్‌పై విమర్శలు..

అంతటితో ఆగని ఆయన.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. అన్నిరంగాల్లో ప్రజలపై ప్రభుత్వం బాదుడే బాదుడు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగాలేదంటూ..మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరం. ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారాలు తప్ప చేసిందేమీ లేదు. సొంత బాబాయిని చంపిన వ్యక్తులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌. జగన్‌ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడు. ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి అని కార్యకర్తల సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read more