వైసీపీ వైరస్‌కు టీడీపీనే వ్యాక్సిన్: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-06T02:27:12+05:30 IST

టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్

వైసీపీ వైరస్‌కు టీడీపీనే వ్యాక్సిన్: చంద్రబాబు

అమరావతి: టీడీపీ నేతలతో  నిర్వహించిన సమావేశంలో జగన్ ప్రభుతంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ వైరస్‌కు టీడీపీనే వ్యాక్సిన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బెదరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీ కేసులకు భయపడి టీడీపీ పారిపోవాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీని లేకుండా చేయడం వైసీపీ తరం కాదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులకు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వం రైతులను, రైతు కూలీలను మోసం చేసిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. బూతులు తిట్టే మంత్రులు మనుషులా, పశువులా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-06T02:27:12+05:30 IST