ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండ: Chandrababu

ABN , First Publish Date - 2022-01-13T18:07:26+05:30 IST

టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు.

ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండ: Chandrababu

అమరావతి: టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల టైంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని అన్నారు. గత దాడుల సమయంలోనే చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్‌ చాటుకున్నారని విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-13T18:07:26+05:30 IST