దళితులపై వైసీపీ దమనకాండ సాగిస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-28T22:07:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీనియర్ నేతలతో చంద్రబాబు

దళితులపై వైసీపీ దమనకాండ సాగిస్తోంది: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీనియర్ నేతలతో  చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ విపత్తులో టెలీమెడిసిన్, ఆర్టీజీ ఉంటే ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వ మితిమీరిన ఆత్మవిశ్వాసం కొంపలు కూల్చుతోందని ధ్వజమెత్తారు. దళితులపై హద్దూ అదుపు లేకుండా వైసీపీ దమనకాండ కొనసాగిస్తోందని మండిపడ్డారు. 14 నెలల్లో దళితులపై 100 చోట్ల దాడులు, దౌర్జన్యాలు హేయమని పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్‌లు, శిరోముండనం, కొట్టి చంపడాలు దారుణమన్నారు.

Updated Date - 2020-07-28T22:07:37+05:30 IST