యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-28T16:59:56+05:30 IST

మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు భౌతికకాయనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

హైదరాబాద్/అమరావతి: మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు భౌతికకాయనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కుటుంబాన్ని ఓదార్చి సానుభూతి ప్రకటించారు. అనంతరం బాబు మాట్లాడుతూ యడ్లపాటి ప్రజల కోసం తాపత్రయ పడ్డారన్నారు. అలాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారని,  అధికారం కావాలని ఏనాడు కోరుకోలేదని తెలిపారు. సంఘం డైరీ స్థాపనకు కృషి చేశారన్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి, అజాత శత్రువు యడ్లపాటి అని కొనియాడారు. పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి అని అన్నారు. యడ్లపాటి వెంకటరావు మృతి బాధాకరమని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. 

Updated Date - 2022-02-28T16:59:56+05:30 IST