బడ్జెట్ ఆశాజనకంగా లేదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-01T22:30:46+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత

బడ్జెట్ ఆశాజనకంగా లేదు: చంద్రబాబు

అమరావతి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఆయన స్పందించారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్‌రంగంలో సంస్కరణలు మంచి పరిణామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏపీ ప్రయోజనాలను సాధించడంలో మరోసారి వైసీపీ విఫలమైందని ఆయన ఆరోపించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-01T22:30:46+05:30 IST