AP News: పోలవరం ముంపు గ్రామాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తా: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-29T00:53:45+05:30 IST

టీడీపీ (TDP) అధికారంలోకి వస్తే పోలవరం ముంపు గ్రామాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు

AP News: పోలవరం ముంపు గ్రామాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తా: చంద్రబాబు

ఏలూరు: టీడీపీ (TDP) అధికారంలోకి వస్తే పోలవరం ముంపు గ్రామాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం కట్టలేమని చేతులెత్తేశారని ఎద్దేవాచేశారు. సీఎం జగన్ (CM Jagan)కు అందరూ చందాలేసుకుని డబ్బులిద్దామని, బస్సులో వచ్చి ఇక్కడే పడుకోమందామన్నారు. బాధితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామంటే ఎందుకు మాట్లాడరని చంద్రబాబు నిలదీశారు. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతావా? అని ప్రశ్నించారు. కోడికత్తి డ్రామాలాపి వరద బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. సీఎం సభలో పెయిడ్ ఆర్టిస్టులు చప్పట్లు కొట్టారని, వారంతా పేటియం బ్యాచ్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 



Updated Date - 2022-07-29T00:53:45+05:30 IST