Chandra babu naidu: విశాఖ ఉక్కు కోసం రాజీనామాలకు టీడీపీ సిద్ధం
ABN , First Publish Date - 2021-07-23T23:45:38+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధం ఉన్నారని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో తెలుగు ప్రజలు స్టీల్ ప్లాంట్ను సాధించారన్నారు. ఎన్నో ఆవరోధాలను అధిగమించి 1992లో స్టీల్ ప్లాంట్ పూర్తియిందన్నారు.
2000 సంవత్సరంలో రూ.4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడిందన్నారు. తన అభ్యర్థన, ప్రభుత్వ విజ్ఞప్తితో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్ నేతృత్వం వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించడం ఎంతో అవసరమన్నారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమని చంద్రబాబు అన్నారు.