టీడీపీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-06-30T05:16:07+05:30 IST
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులం తా సిద్ధంగా ఉండాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ అన్నారు.
నరసాపురం టౌన్, జూన్ 29: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులం తా సిద్ధంగా ఉండాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బూత్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాజధాని లేదు, అప్పులు ఊబిలోకి కూరుకుపోయిందన్నారు. మరోసారి వైసీపీ అధి కారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రి కావడం రాష్ర్టానికి అవసరమన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. టీడీపీ నాయకులు జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, గుబ్బల నాగరాజు, కొప్పాడ రవి, అధికారి అనంతరామారావు, నాగబాబు, ఉమా, అకన సుబ్రమణ్యం, మౌలాలీ, సంకు భాస్కర్, మల్లాడి మూర్తి తదితరులు పాల్గొన్నారు.