టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాం
ABN , First Publish Date - 2022-07-06T03:18:31+05:30 IST
టీడీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకులు పేర్కొన్నారు
- సీనియర్ నాయకులు
ఉలవపాడు, జూలై 5: టీడీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకులు పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ శేషారెడ్డి కాంప్లెక్స్లో మంగళవారం వారంతా కలిసి టీడీపీ సీనియర్ సిటిజన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తొలి సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ సీనియర్ సిటిజన్ కార్యవర్గానికి అధ్యక్షుడిగా ఎంపికైన దామచర్ల సుబ్బారావు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం పార్టీ సీనియర్లుగా తాము కార్యకర్తల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని, సీనియర్ సిటిజన్లకు ప్రయాణంలో రాయితీలు కల్పించాలని, పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని తీర్మానాలు చేశారు. అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ జడ్పీటీసీ, టీడీపీ సీనియర్ నాయకుడు డీఏ కోటయ్యకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ అనుచరులు ఆర్థిక సాయం అందించారు. అలాగే మరికొందరికి కూడా ఆర్థిక సహాయం అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ప్రధాన కార్యదర్శి కారుమంచి పెనుగొండయ్య, అధికార ప్రతినిధి నత్తా నారయ్య, తదితరులు పాల్గొన్నారు.