గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2022-08-19T06:28:53+05:30 IST

గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి కృషి

గ్రామాల్లో టీడీపీ బలోపేతానికి కృషి
వీరమాచనేని వెంకట కృష్ణారావును అభినందిస్తున్న టీడీపీ మండల నాయకులు

పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగంఉపాధ్యక్షుడు వీరమాచనేని

నుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఆగస్టు 18 : : ప్రజా సమస్యలతో పాటు చిరువ్యాపా రులు, వర్తకులు ఎదుర్కొంటున్న లైసెన్స్‌ విధానం, జీఎస్‌టీ తదితర సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటానికి తన వంతు సహకార మందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ బలో పేతానికి కృషి చేస్తానని టీడీపీ గన్నవరం నియోజకవర్గ వాణిజ్య విభాగంఉపాధ్యక్షుడు వీరమాచనేని వెంకట కృష్ణారావు(బుజ్జి) తెలి పారు. విజయవాడలో జరిగిన టీడీపీ అను బంధ విభాగాల సమావేశంలో వీరమాచనేని వెంకట కృష్ణారావుకు గన్నవరం నియోజకవర్గ వాణిజ్య విభాగంఉపాధ్యక్షుడుగా నియామక పత్రాన్ని రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్‌ బుధవారం రాత్రి అంద జేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతూ, బాపులపాడు మండలంలో టీడీపీ గెలుపునకు కృషి చేసిన వ్యక్తిగా తన సేవలు మరింత విస్తృతం చేసేందుకు, రాను న్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో చంద్ర బాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసేందు కుఈ పదవిని వినియోగించుకుంటానని తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, డూండీ రాకేష్‌, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడవల్లి నరసింహారావు, గుజ్జర్లపూడి బాబూరావు, బొప్పన హరికృష్ణ, గరిమెళ్ల నరేంద్ర  పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకులు కంపసాటి కొండలరావు, బోయపాటి ప్రసాద్‌, వడ్డిల్లి లక్ష్మి, గార్లపాటి రాజేశ్వరరావు, సూ రపనేని రంగారావు అభినందించారు. 

Updated Date - 2022-08-19T06:28:53+05:30 IST