నిత్యావసర ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-22T05:48:41+05:30 IST

రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకులు ధరలు తక్షణం తగ్గించి పేదలను ఆదుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేష్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిత్యావసర ధరలు తగ్గించాలి
నడిపూడిలో ‘బాదుడే బాదుడు’ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

నడిపూడిలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం 

పెనుగొండ, మే 21 : రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకులు ధరలు తక్షణం తగ్గించి పేదలను ఆదుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేష్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నడిపూడిలో టీడీ పీ నాయకుడు మన్నె వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదు డు’ కార్యక్రమం నిర్వహించారు.  ఇటీవల పెరిగిన నిత్యావసర సరుకు ల ధరల కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. గంధం వెంకట్రాజు,  కేతా మీ రయ్య, మదన్‌ తానేటి, కేతా సత్తిబాబు, పితాని శేఖర్‌, లోకేష్‌ పాల్గొన్నారు. 

సభ్యత్వ నమోదు లక్ష్యం 50 వేలు : పొత్తూరి 

నరసాపురం రూరల్‌, మే 21: నియోజకవర్గంలో ఈసారి 50 వేలు పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు అన్నారు. శనివారం మల్లవరంలంకలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారన్నారు. జగన్‌ పాలనపై విసుగెత్తి ప్రజలు మార్పును కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో వాతాడి ఉమా, నర్సింహారావు, నాగేశ్వరరావు, బాలకృష్ణ, గోపాల్‌, పద్మారావు, దుర్గాప్రసాద్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:48:41+05:30 IST