గుడ్డంపల్లితండాలో టీడీపీ ‘బాదుడే బాదుడు’
ABN , First Publish Date - 2022-07-07T05:55:59+05:30 IST
మండల పరిధిలోని గుడ్డంపల్లి తండాలో బుధవారం టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ ఆద్వర్యంలో బాదుడే-బాదుడు కార్యక్రమా న్ని నిర్వహించారు.
ముదిగుబ్బ, జూలై 6: మండల పరిధిలోని గుడ్డంపల్లి తండాలో బుధవారం టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ ఆద్వర్యంలో బాదుడే-బాదుడు కార్యక్రమా న్ని నిర్వహించారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. వైసీపీ పాలనలో పేదలకు ఉపయోగపడే సంక్షేమపథకాలు అమలు చేయలేదు కానీ... నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ తదితర వస్తువులపై భారీగా ధరలు పెంచారన్నార. పెంచిన ధరలు తగ్గించేవరకు టీడీపీ పోరాడుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాంబశివనాయక్, దాసునాయక్, మహబూబ్పీరా, ఆనంద్, త్రిలోక్, మీసాల రాజు, బైరవకిష్టప్ప, రియాజ్, నరేశ, నారాయణస్వామి, ఈశ్వర్రెడ్డి, ప్రకాశరెడ్డి, లోకేశనాయక్, రామాంజినాయక్, కిరణ్నాయక్, తిరుపాల్నాయక్, సాయినాయక్ పాల్గొన్నారు.