తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా టీడీపీ

ABN , First Publish Date - 2022-05-19T08:42:10+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి ఎం.అరవింద్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా టీడీపీ

మినీ మహానాడు సభలో అరవింద్‌ కుమార్‌ గౌడ్‌

రాంనగర్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి ఎం.అరవింద్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా టీడీపీ మద్దతు కావాల్సి ఉంటుందన్నారు. దోమలగూడలోని పార్టీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల మినీ మహానాడు జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం.అరవింద్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్రజలు తిరిగి టీడీపీ పాలనను కోరుకుంటున్నారన్నారు.  

Updated Date - 2022-05-19T08:42:10+05:30 IST