హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా?: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-01-20T21:32:25+05:30 IST

తమ హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని

హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా?: అచ్చెన్నాయుడు

అమరావతి: తమ హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత టీడీపీ  ప్రభుత్వం 43 శాతం పీఆర్సీ ఇస్తే నాడు జగన్‌రెడ్డి తప్పుబట్టారన్నారు. నేడు అసలు వేతనాలకు జగన్‌ ఎసరు పెట్టాడని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కోట్టటం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన  హమీల్లో  రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీ కరణ చేస్తానని చెప్పి వారి ఆశలకు జగన్ సమాధి కట్టారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. హక్కులు సాధించుకునే వరకు ఉద్యోగులకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-20T21:32:25+05:30 IST