హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబానికి టీడీపీ అండ

ABN , First Publish Date - 2022-05-24T05:15:56+05:30 IST

కాకినాడలో హత్యకు గురైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.

హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబానికి టీడీపీ అండ
విలేఖరులతో మాట్లాడుతున్న బండారు సత్యనారాయణమూర్తి

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

విశాఖపట్నం, మే 23: కాకినాడలో హత్యకు గురైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. హత్య చేసిన వ్యక్తే మృతుడి కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించిన ఘనత వైసీపీ పాలనలోనే చూశామని ఎద్దేవా చేశారు.


జగన్‌ దావోస్‌లో ఉండి సజ్జల దర్శకత్వంలో ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్యకేసు నడిపిస్తున్నారని, ఇప్పటికీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల రక్షణలో ఉన్నాడని ఆరోపించారు. అదే జిల్లాకు చెందిన కారంపూడి శివాజీ, జూపూడి ప్రభాకరరావులు సుబ్రహ్మణ్యం హత్యపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రంపచోడవరం ఎమ్మెల్యేని అమాయకుడిని చేసి అనంతబాబు అకృత్యాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.


Updated Date - 2022-05-24T05:15:56+05:30 IST