సమస్యలు పరిష్కరించాలని టీడీపీ ధర్నా
ABN , First Publish Date - 2021-10-27T05:51:42+05:30 IST
తాడేపల్లిగూడెం మునిసిపాలిటిలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 26: తాడేపల్లిగూడెం మునిసిపాలిటిలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వా మికి వలవల బాబ్జి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మునిసిపాలిటీలో మంచినీరు, రోడ్ల సమస్యలు, డ్రెయినేజీ సమస్య లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన లేరన్నారు. కమిషనర్కు తెలిపినా పెడచెవిన పెడుతున్నాడని విమర్శించారు. టీడీపీ హయాంలో నిర్మించిన 5376 టిడ్కో ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు అందించకపోవడం మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బడుగు పెద్ద, గంధం సతీష్, పట్నాల రాంపండు, కొల్లి రమావతి. సుబద్ర, బాజి తదితరులు పాల్గొన్నారు.