ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-06-20T04:47:48+05:30 IST

కరోనా నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మరణాలు సంభవించా యని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సూరపనేని రామ్మోహన్‌ (చిన్ని) విమ ర్శించారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా మరణాలు
ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు

కొవ్వూరు,జూన్‌ 19: కరోనా నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మరణాలు సంభవించాయని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సూరపనేని రామ్మోహన్‌ (చిన్ని) విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో డి.లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సూరపనేని చిన్ని మాట్లాడుతూ కొంతమంది జీవనోపాధి కొల్పోతే, మరికొంత మంది కుటుంబ యజమానులను కోల్పోయారన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల పరిహారం ఇప్పటివరకు ఎవరికి అందలేదన్నారు. కార్యక్రమంలో కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ,బేతిన నారాయణ,సూర్యదేవర రంజిత్‌,యలమాటి.సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్‌, నాయుడు వీర్రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:47:48+05:30 IST