‘పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-12-06T05:40:35+05:30 IST

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారంగా మారనున్న ఇంటి పన్ను, నీటి చార్జీలు, డ్రెయినేజీ చార్జీల పెంపు జీవోలను వెంటనే రద్దు చేయాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.

‘పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి’

తణుకు, డిసెంబరు 5 : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారంగా మారనున్న ఇంటి పన్ను, నీటి చార్జీలు, డ్రెయినేజీ చార్జీల పెంపు జీవోలను వెంటనే రద్దు చేయాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. తణుకు టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ చట్టాల సవరణ పేరుతో ప్రభుత్వం మూడు జీవోలు తీసుకువచ్చి పట్టణ ప్రజలను మరింత దోపిడీ చేసేందుకు సిద్ధం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి విలువ ఆధారంగా కాదని, అద్దె విలువ ఆధారంగానే ఇంటి పన్నులను వసూలు చేయాలన్నారు. ఈ మూడు జీవోల అమలు జరిపితే ఒక్కో కుటుంబంపై రూ.2 వేల నుంచి రూ. 10 వేల వరకు పన్నుల రూపంలో భారం పడుతుందన్నారు. తక్షణమే జీవోలను రద్దు చేయాలని లేకపోతే ప్రజా ఉద్యమం నిర్వహిస్తామన్నారు. దొమ్మేటి వెంకట సుధాకర్‌, పరిమి వెంకన్నబాబు, బసవా రామకృష్ణ, తోట సూర్యనారాయణ, మంత్రిరావు వెంకటరత్నం, తాతపూడి మారుతీరావు, చింతలపూడి సన్యాసిరావు, తమరపు రమణమ్మ, తేతలి సాయి, ఎ.లాజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:40:35+05:30 IST