‘రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలి’

ABN , First Publish Date - 2021-07-27T23:54:40+05:30 IST

‘రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలి’

‘రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలి’

అమరావతి: కార్మికుల సంక్షేమనిధి నుంచి 750 కోట్ల రూపాయలను దారి మళ్లించారని టీడీపీ నేత సయ్యద్‌రఫీ ఆరోపించారు. నిధులను దారి మళ్లించినందుకు మంత్రి జయరామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.750 కోట్లను నెలరోజుల్లో సంక్షేమసంఘానికి జమ చేయాలన్నారు. జగన్మోహన్‌రెడ్డి జమానాలో కార్మికులకు ఆకలిచావులే మిగిలాయన్నారు. ఉపాధిలేక 60 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కుటుంబానికి కూడా సీఎం రూపాయి సాయం చేయలేదన్నారు. మంత్రి జయరామ్‌కు అవినీతిపై ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-27T23:54:40+05:30 IST