‘చేయూత పథకం’ మోసం
ABN , First Publish Date - 2021-06-24T04:05:09+05:30 IST
వైఎస్సార్ చేయూత పథకం మహిళలను మోసం చేసే ‘జగన్రెడ్డి మాయ’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్నజీర్ అన్నారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్
మహారాణిపేట, జూన్ 23: వైఎస్సార్ చేయూత పథకం మహిళలను మోసం చేసే ‘జగన్రెడ్డి మాయ’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్నజీర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంక్షేమ పథకాలన్నీ మోసం, బూటకమని ఆరోపించారు. ఎన్నికల ముందు 45 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అమలు చేయలేదన్నారు.
రాష్ట్రంలో 45 ఏళ్లుపైబడిన మహిళలు దాదాపు కోటి మంది ఉంటారని, కానీ ప్రభుత్వం 23 లక్షల మందికే చేయూత పథకం అందించి చేతులు దుపుపుకుందన్నారు. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో 93 లక్షల మందికి పసుపు, కుంకుమ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన చాలామందికి చేయూత అందడం లేదంటే దగా చేయడం కాదా? అని ప్రశ్నించారు. చేయూత సొమ్ముతో ఆవులు, గేదెలు కొనుగోలుచేసి వాటి పాలను అమూల్ సంస్థకు విక్రయించాలని నిబంధన పెట్టడం సరికాదన్నారు.