ఓట్లు పడవని వలంటీర్లను తిప్పుతున్నారు: టీడీపీ
ABN , First Publish Date - 2021-04-11T09:21:51+05:30 IST
తమ మొహాలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని గుర్తించిన వైసీపీ నేతలు ఓటర్ల వద్దకు వలంటీర్లను తిప్పుతున్నారని తెలుగుదేశం
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): తమ మొహాలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని గుర్తించిన వైసీపీ నేతలు ఓటర్ల వద్దకు వలంటీర్లను తిప్పుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. రాజకీయంగా తమ శక్తితో తాము ఓట్లు తెచ్చుకోవాల్సింది పోయి ఓట్లు రాకపోతే వలంటీర్ల ఉద్యోగాలు తీసివేస్తామని బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వైసీపీ నేతలు దిగజారారని టీడీపీ అనుబంధ రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. ఓటర్లకు వివిధ విషయాలపై అవగాహన కల్పించడం కోసం టీడీపీ ముద్రించిన కరపత్రాలపై ఎన్నికల కమిషన్కు వైసీపీ ఫిర్యాదును మర్రెడ్డి తప్పుబట్టారు.